ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నరసింహ అవతార క్షేత్రం అహోబిలం

శ్రీమహావి­ష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ....శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్టశిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహ స్వా­మి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వా­మి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు.

రతనాల రాయలసీమకు ముఖద్వారం, శ్రీశైలం, మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూలు. ఈ కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి­ ఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వా­మి మొత్తం 9రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వా­మి దర్శన­మిస్తారు.

అవతరించిన ప్రదేశం ఇదే

హరినామమే కడు ఆనందకరమూ అని ప్రతి నిత్యం శ్రీమహావి­ష్ణువు ధ్యానంలో గడిపే బాల భక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడు అనే రాజు కుమారుడే ఈ ప్రహ్లాదుడు. హరిజపం తప్ప మరో వ్యాపకం లేకుండా గడుపుతుంటాడు ఆ బాలుడు. అయితే పరమ హరి ద్వేషి అయిన హిరణ్యకశిపునికి ఇది ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదట. అనేక సార్లు నచ్చజెప్పి చూసినా విష్ణుభజన మానకపోవడంతో కుమారుడు అన్న మమకారాన్ని సైతం మరిచి చంపేందుకు సిద్ధం అవుతాడు. చాలా సార్లు కొడుకును హతమార్చేందుకు యత్నించినా మహావి­ష్ణువు దయ వల్ల బయటపడతాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని ­షయంలో హిరణ్యకశిపుని ఆగడాలు శృతి­మించుతూ ఉండడంతో మహావి­ష్ణువు సింహం తల, మనిషి శరీరం దాల్చి నరసింహుడుగా అవతరించి ఆ రూపంలోనే హిరణ్యకశిపున్ని సంహరిస్తాడు. వి­ష్ణువు నరసింహుడుగా మారింది అహోబిల క్షేత్రంలోనే అని అంటారు. నరసింహుడు బయల్పడిన స్తంభం కూడా ఈ ప్రదేశంలో కనిపిస్తుంది. దీన్ని ఉగ్రస్తంభంగా పేర్కొంటారు. ఈ ప్రాంతాన్నే ఎగువ అహోబిలం అని అంటారు.

నవనారసింహుడిగా ఒకే చోట కొలువైన అహోబిల క్షేత్రం దేశంలోని నరసింహ క్షేత్రాల్లోనే అత్యంత పవిత్రమైనదిగా ప్రతీతి. నరసింహుడు జనించిన ఈ ప్రాంతం మహిమలను చూపడంలోనూ అంతే రీతిగా ప్రసిద్ధి చెందింది. ­­వివిధ సమస్యలతో ఈ సన్నిధికి వచ్చిన వారికి ఇక్కడి స్వామి అంతులేని మానసిక ప్రశాంతతను సిద్ధిస్తాడట.

పంచ ప్రదిక్షణలతో ప్రశాంతత
అహోబిల నరసింహ స్వామి లీలా ­శేషాల్లో ప్రధానమైనది మానసిక గందరగోళాన్ని దూరం చేయడంలో ఈయన చూపే మహిమలు. సమస్యలతో మనసు ­కలమైన వారు అహోబిల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ 5 ప్రదక్షిణలు నిర్వహిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయట.

నరసింహుడు ఎక్కడ కొలువై ఉన్నా ఆయన లీలలకు లోటుందట. అలాంటి ఆ స్వా­మి తాను అవతరించిన ప్రదేశమైన అహోబిలంలో అంతకు మించిన రీతిలో భక్తులను దీవి­స్తున్నాడు. మహాశక్తివంత దైవ స్వరూపంగా పేరున్న ఈ స్వా­మి మీద భారం వేస్తే బాధాపీడితులకు ఏదో రూపంలో దారి చూపుతాడని పేరు. మహామహిమాకరుడైన నరసింహ స్వామి నవనారసింహుడుగా కొలువైన అహోబిల క్షేత్రం ప్రతి నిత్యం హరినామ ఘోషలతో అలరారుతూ ఉంటుంది. వైష్ణవ పూజా ­ధానంలో అత్యంత ప్రశస్తమైనదిగా చెప్పే పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అహోబిలంలో నిత్యపూజలు జరుగుతాయి.

అహోబిల నరసింహ స్వా­మికి ఉదయం సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ­విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ పిదప వరుసగా బాలభోగం, తలిగ ఆరాధన, తోమాల సేవ, పానకారాధన వంటి­ ఉంటాయి. రాత్రి ఉత్సవమూర్తికి శయనం చేసి పాలు, క్షీరాన్నం ఆరగింపు ఇస్తారు. దీంతో నిత్యపూజలు పరిసమాప్తం అవుతాయి.

నిత్యపూజలతో పాటు వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వర్షోత్సవాలు వంటి­ నిర్వహిస్తారు. దీనితో పాటు ఫాల్గుణ శుక్ల చ­తి నుంచి పౌర్ణ­మి వరకు స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వివి­­ధ రూపాలు ధరించిన ప్రహ్లాద వరదస్వా­మి ఆలయ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ ఉంటారు.

అద్భుతమైన కళాసంపద


భారతీయ దేవాలయాలు... అద్భుత నిర్మాణ సంపదకు కేంద్రాలు. ప్రాచీన నిర్మాణ కళాచాతుర్యాన్ని సగర్వంగా చాటుతూ అలరారుతూ ఉంటుంది అహోబిల క్షేత్రం. ప్రాకారాలు, నిర్మాణాలు, గోపురాలు.... ఇలా ప్రతి అడుగులోనూ కళాత్మకత ఉట్టిపడుతూ ఈ క్షేత్రం మైమరిపిస్తుంది.

భారతీయుల నిర్మాణ చాతుర్యాన్ని దశదిశలా చాటుతూ అలరారుతున్న దేవస్థానం అహోబిల క్షేత్రం. సువిశాల ప్రాంగణంలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక మంది రాజులు, చక్రవర్తులు పాటుపడ్డట్లు స్థలపురాణం. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు స్వామికి బంగారు వి­గ్రహాలు తయారుచేయించి మంటపాలు, దేవాలయం నిర్మించినట్లు చెబుతారు.

ఆలయంలో 64 స్తంభాలతో కళ్యాణ మంటపం, 82 స్తంభాలతో మరో మంటపం కనిపిస్తుంది. దీన్నే రంగమంటపం అని అంటారు. ఈ రంగమంటపాన్ని 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించారు. ఈ ఆలయంలో స్తంభాలు, ప్రాకారాలు, గోపురాలపై అలనాటి శాసనాలు, నృసింహ స్వామి అవతార వి­శేషాలు, నృత్యభంగిమలు, శృంగార శిల్పాలు, ­­వివిధ వైష్ణవ స్వరూపాలు వంటి­ దర్శనమిస్తాయి.

భారతీయుల నిర్మాణ చాతుర్యాన్ని సగర్వంగా చాటుతూ అత్యద్భుత శిల్పకళా సంపదతో అలరారుతూ ఉంటుంది అహోబిల క్షేత్రం. కళ్లు తిప్పుకోనివ్వని ­­ధ శిల్పాలు, ప్రాకారాలు, గోపురాలతో ఈ ఆలయం విరాజిల్లుతోంది.

శ్రీవేంకటేశ్వరుడు ప్రతిష్టించిన స్వరూపం

పద్మావతీ పరిణయ సమయంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన స్వరూపం దిగువ అహోబిల నరసింహ స్వామి. అనేక మంది దేవతలు, రుషులు దర్శించి పావనమైన ప్రదేశమని ఈ అహోబిలానికి పేరు. నరసింహ క్షేత్రాల్లోనే మహిమాన్విత పుణ్యధామంగా ఈ ప్రదేశం అలరారుతూ ఉంది.

దేశంలోని మరే నరసింహ క్షేత్రానికి లేని వి­శిష్టత అహోబిల క్షేత్రం కల్గి ఉంది. వి­ష్ణుమూర్తి నరసింహుడుగా ఇదే ప్రదేశంలో అవతరించినట్లు స్థలపురాణం. దిగువ అహోబిలంలో ఉన్న మూల­రాట్‌ను...... పద్మావతితో కళ్యాణానికి ముందు వెంకటేశ్వర స్వా­మి ప్రతిష్టించినట్లు స్థలపురాణం. ఈ ఆలయ పరిసరాల్లో నరసింహ స్వా­మి 9 రూపాల్లో కొలువై ఉన్నారు. నరసింహుడు ఇన్ని రూపాల్లో కొలువైన పుణ్యతీర్ధం మరెక్కడా లేదని ప్రతీతి.

అహోబిల క్షేత్రంలో ఉపాలయాలుగా గరుడాళ్వార్‌ సన్నిధి, మహాలక్ష్మి వంటి దైవాలు కొలువుతీరి ఉన్నారు. వీరితో పాటు కోదండరామ స్వామి వంటి దైవం కూడా దర్శనమిస్తారు. దీనితో పాటు ­శాలమైన పుష్కరిణి కూడా కనిపిస్తుంది.

ఎలా వెళ్లాలి?

అహోబిలం చేరుకోవడానికి ­విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68కిలోమీటర్ల దూరంలోను, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలోనూ అహోబిలం నెలవై ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఇక్కడికి వి­స్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నవనారసింహుడు కొలువైన అహోబిల క్షేత్రాన్ని దర్శించి ­మీరూ పునీతులు కండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమ్మపల్లి కోదండరామాలయం

పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం. ఆలయ చరిత్ర     ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకత ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి. స్వామిని దర్శిస్తే.. ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మ

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర

సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మక