పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం.
ఆలయ చరిత్ర
ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
ప్రత్యేకత
ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి.
స్వామిని దర్శిస్తే..
ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్యరాముడిగా ప్రసిద్ధికెక్కాడు. అనారోగ్య పీడితులైనవారు, ఇక్కడి కోదండ రామస్వామిని దర్శిస్తే, త్వరితగతిన వ్యాధి నయమవుతుందన్న విశ్వాసం భక్తులది. విద్యాబుద్ధులు ప్రసాదించే దేవుడిగా, ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా, సంతనా,అనారోగ్యసమస్యలున్నవారికి ఆపద్భాందవుడిగా వినుతికెక్కాడు అమ్మపల్లి శ్రీరాముడు.
పూజాదికాలు
ఉదయం ఆరు గంటల నుంచే అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయంలో పుజాధికాలు ఆరంభం అవుతాయి. శనివారం ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీయేటా శ్రీరామనవమికి అంగరంగ వైభవమైన ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఆలయ విశిష్టత
అత్యంత విశాలమైన పరిసరాల్లో నెలవై దర్శించినంతనే మనసుకు ఆహ్లాదానుభూతిని ప్రసాదించే చూడచక్కని ఆలయం అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయం. గగనాన్ని తాకుతుందా అనిపించే ఎత్తైన రాజగోపురం, దాన్ని దాటుకుని వెళ్లగానే కనిపించే విశాలమైన మంటపాలు, చుట్టూ కోనేర్లు భక్తులకు దర్సనమిస్తాయి. పూర్వ కాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవరాట.
అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ షాహీ సుల్తానులు చారిత్రక చార్మినార్ ను నిర్మించారట. శతాబ్ధాల క్రితం వేంగి రాజులు ప్రతిష్టించినట్లుగా భావించే అనేక శిల్పాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి.
ఎలా వెళ్లాలి?
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మపల్లి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ముప్పై కిలోమీటర్లు. చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, దిల్ సుఖ్ నగర్ ల నుంచి శంషాబాద్ కు విస్తృతమైన బస్సు సౌకర్యాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి అమ్మపల్లికి నిరంతరం ఆటోలు తిరుగుతూ ఉంటాయి.
ఆలయ చరిత్ర
ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
ప్రత్యేకత
ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి.
స్వామిని దర్శిస్తే..
ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్యరాముడిగా ప్రసిద్ధికెక్కాడు. అనారోగ్య పీడితులైనవారు, ఇక్కడి కోదండ రామస్వామిని దర్శిస్తే, త్వరితగతిన వ్యాధి నయమవుతుందన్న విశ్వాసం భక్తులది. విద్యాబుద్ధులు ప్రసాదించే దేవుడిగా, ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా, సంతనా,అనారోగ్యసమస్యలున్నవారికి ఆపద్భాందవుడిగా వినుతికెక్కాడు అమ్మపల్లి శ్రీరాముడు.
పూజాదికాలు
ఉదయం ఆరు గంటల నుంచే అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయంలో పుజాధికాలు ఆరంభం అవుతాయి. శనివారం ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీయేటా శ్రీరామనవమికి అంగరంగ వైభవమైన ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఆలయ విశిష్టత
అత్యంత విశాలమైన పరిసరాల్లో నెలవై దర్శించినంతనే మనసుకు ఆహ్లాదానుభూతిని ప్రసాదించే చూడచక్కని ఆలయం అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయం. గగనాన్ని తాకుతుందా అనిపించే ఎత్తైన రాజగోపురం, దాన్ని దాటుకుని వెళ్లగానే కనిపించే విశాలమైన మంటపాలు, చుట్టూ కోనేర్లు భక్తులకు దర్సనమిస్తాయి. పూర్వ కాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవరాట.
అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ షాహీ సుల్తానులు చారిత్రక చార్మినార్ ను నిర్మించారట. శతాబ్ధాల క్రితం వేంగి రాజులు ప్రతిష్టించినట్లుగా భావించే అనేక శిల్పాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి.
ఎలా వెళ్లాలి?
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మపల్లి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ముప్పై కిలోమీటర్లు. చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, దిల్ సుఖ్ నగర్ ల నుంచి శంషాబాద్ కు విస్తృతమైన బస్సు సౌకర్యాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి అమ్మపల్లికి నిరంతరం ఆటోలు తిరుగుతూ ఉంటాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి