ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమ్మపల్లి కోదండరామాలయం

పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం.

ఆలయ చరిత్ర
    ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

ప్రత్యేకత

ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి.

స్వామిని దర్శిస్తే..

ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్యరాముడిగా ప్రసిద్ధికెక్కాడు. అనారోగ్య పీడితులైనవారు, ఇక్కడి కోదండ రామస్వామిని దర్శిస్తే, త్వరితగతిన వ్యాధి నయమవుతుందన్న విశ్వాసం భక్తులది. విద్యాబుద్ధులు ప్రసాదించే దేవుడిగా, ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా, సంతనా,అనారోగ్యసమస్యలున్నవారికి ఆపద్భాందవుడిగా వినుతికెక్కాడు అమ్మపల్లి శ్రీరాముడు.

పూజాదికాలు
ఉదయం ఆరు గంటల నుంచే అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయంలో పుజాధికాలు ఆరంభం అవుతాయి. శనివారం ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీయేటా శ్రీరామనవమికి అంగరంగ వైభవమైన ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయ విశిష్టత
అత్యంత విశాలమైన పరిసరాల్లో నెలవై దర్శించినంతనే మనసుకు ఆహ్లాదానుభూతిని ప్రసాదించే చూడచక్కని ఆలయం అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయం. గగనాన్ని తాకుతుందా అనిపించే ఎత్తైన రాజగోపురం, దాన్ని దాటుకుని వెళ్లగానే కనిపించే విశాలమైన మంటపాలు, చుట్టూ కోనేర్లు భక్తులకు దర్సనమిస్తాయి. పూర్వ కాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవరాట.

    అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ షాహీ సుల్తానులు చారిత్రక చార్మినార్ ను నిర్మించారట. శతాబ్ధాల క్రితం వేంగి రాజులు ప్రతిష్టించినట్లుగా భావించే అనేక శిల్పాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి.

ఎలా వెళ్లాలి?
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మపల్లి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ముప్పై కిలోమీటర్లు. చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, దిల్ సుఖ్ నగర్ ల నుంచి శంషాబాద్ కు విస్తృతమైన బస్సు సౌకర్యాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి అమ్మపల్లికి నిరంతరం ఆటోలు తిరుగుతూ ఉంటాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర

సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మక

నరసింహ అవతార క్షేత్రం అహోబిలం

శ్రీమహావి­ష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ....శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్టశిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహ స్వా­మి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వా­మి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు. రతనాల రాయలసీమకు ముఖద్వారం, శ్రీశైలం, మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూలు. ఈ కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి­ ఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వా­మి మొత్తం 9రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వా­మి దర్శన­మిస్తారు. అవతరించిన ప్రదేశం ఇదే హరినామమే కడు ఆనందకరమూ అని ప్రతి నిత్యం శ్రీమహావి­ష్ణువు ధ్యానంలో గడిపే బాల భక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడ