పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం.
పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది.
క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్రునిచే అమరావతిలో ప్రతిష్టమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలోని శివలింగం అదేనని భక్తుల విశ్వాసం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున ఇక్కడ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది.
సకల శుభకరం
పవిత్ర దివ్యదైవమైన అమరేశ్వరుని దర్శనం సకల శుభకరం అని ప్రతీతి. ఇక్కడ మరణిస్తే, వారి ఆత్మ శివునిలో కలిసిపోతుందని చెబుతారు. అంతటి మహిమాకరుడట ఇక్కడి శివుడు. 15 అడుగుల ఎత్తైన రూపంలో కనిపించే అమరేశ్వరుడిని దర్శించిన భక్తుల జీవితాలను సైతం ఉన్నతస్థితి చేర్చుతాడట. ఆయన రూపం ద్వారానే ఈ విషయాన్ని చాటుతుంటాడని చెబుతారు.
మహిమాకరుడైన ఇక్కడి అమరలింగేశ్వరుడిని ప్రతినిత్యం విశేష సంఖ్యలో భక్తులు దర్సించుకుంటారు. అమరము అంటే అంతం లేనిది అని అర్థం. తనను మొక్కిన భక్తులకు అసలు అంతం లేని శుభాలను అందించి, వారి జీవితాలను శుభ్రదం చేస్తాడు కనుకనే, ఈయనకు అమరేశ్వరుడు అని పేరు వచ్చిందంటారు.
అలంకార ప్రియుడు
శివుడు ఆది దేవుడు. అంతటి శక్తిమంత దైవానికి అమరావతి క్షేత్రంలో నిత్యం అంగరంగ వైభవంగా పూజాపునస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామిని సుందరంగా అలంకరించి పూజాధికాలు నిర్వహిస్తారు. అభిషేక ప్రియుడని పేరున్న శివుడు అమరావతిలో మాత్రం అలంకార ప్ర్రియుడిగా దర్శనమిస్తాడు. ఆలయం కూడా సువిశాల స్థలంలో నిర్మితమయ్యింది. బౌద్ధ, ద్రవిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఐదు పంచారామ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
చేరుకోవడం ఎలా?
అమరావతి క్షేత్రం గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి నిరంతరం బస్సు సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కూడా తరచూ బస్సులు వెళుతుంటాయి. వాహనాల్లో వెళ్లేవారు విజయవాడ నుంచి కృష్ణానది కరకట్ట ద్వారా వెళ్లవచ్చు.
వసతి.. ఇతర దర్శనీయ స్థలాలు..
అమరావతిలో ఏపీ టూరిజం వారి హరిత గెస్ట్ హౌస్ ఉంది. ముందుగానే గదులు బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర లాడ్జిలు కూడా అందుబాటులో ఉంటాయి.
అమరావతిలోనే కాలచక్రం నిర్వహించారు. ఇక్కడ అతిపెద్ద బుద్ధ విగ్రహం అందరికీ ఆహ్వానం పలుకుతుంది. పురావస్తు శాఖవారి మ్యూజియం కూడా ఉంది.
పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది.
క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్రునిచే అమరావతిలో ప్రతిష్టమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలోని శివలింగం అదేనని భక్తుల విశ్వాసం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున ఇక్కడ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది.
సకల శుభకరం
పవిత్ర దివ్యదైవమైన అమరేశ్వరుని దర్శనం సకల శుభకరం అని ప్రతీతి. ఇక్కడ మరణిస్తే, వారి ఆత్మ శివునిలో కలిసిపోతుందని చెబుతారు. అంతటి మహిమాకరుడట ఇక్కడి శివుడు. 15 అడుగుల ఎత్తైన రూపంలో కనిపించే అమరేశ్వరుడిని దర్శించిన భక్తుల జీవితాలను సైతం ఉన్నతస్థితి చేర్చుతాడట. ఆయన రూపం ద్వారానే ఈ విషయాన్ని చాటుతుంటాడని చెబుతారు.
మహిమాకరుడైన ఇక్కడి అమరలింగేశ్వరుడిని ప్రతినిత్యం విశేష సంఖ్యలో భక్తులు దర్సించుకుంటారు. అమరము అంటే అంతం లేనిది అని అర్థం. తనను మొక్కిన భక్తులకు అసలు అంతం లేని శుభాలను అందించి, వారి జీవితాలను శుభ్రదం చేస్తాడు కనుకనే, ఈయనకు అమరేశ్వరుడు అని పేరు వచ్చిందంటారు.
అలంకార ప్రియుడు
శివుడు ఆది దేవుడు. అంతటి శక్తిమంత దైవానికి అమరావతి క్షేత్రంలో నిత్యం అంగరంగ వైభవంగా పూజాపునస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామిని సుందరంగా అలంకరించి పూజాధికాలు నిర్వహిస్తారు. అభిషేక ప్రియుడని పేరున్న శివుడు అమరావతిలో మాత్రం అలంకార ప్ర్రియుడిగా దర్శనమిస్తాడు. ఆలయం కూడా సువిశాల స్థలంలో నిర్మితమయ్యింది. బౌద్ధ, ద్రవిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఐదు పంచారామ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
చేరుకోవడం ఎలా?
అమరావతి క్షేత్రం గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి నిరంతరం బస్సు సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కూడా తరచూ బస్సులు వెళుతుంటాయి. వాహనాల్లో వెళ్లేవారు విజయవాడ నుంచి కృష్ణానది కరకట్ట ద్వారా వెళ్లవచ్చు.
వసతి.. ఇతర దర్శనీయ స్థలాలు..
అమరావతిలో ఏపీ టూరిజం వారి హరిత గెస్ట్ హౌస్ ఉంది. ముందుగానే గదులు బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర లాడ్జిలు కూడా అందుబాటులో ఉంటాయి.
అమరావతిలోనే కాలచక్రం నిర్వహించారు. ఇక్కడ అతిపెద్ద బుద్ధ విగ్రహం అందరికీ ఆహ్వానం పలుకుతుంది. పురావస్తు శాఖవారి మ్యూజియం కూడా ఉంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి