ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అమరేశ్వర దేవస్థానం - అమరావతి

పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం.

పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది.

క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్రునిచే అమరావతిలో ప్రతిష్టమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలోని శివలింగం అదేనని భక్తుల విశ్వాసం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున ఇక్కడ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది.

సకల శుభకరం

పవిత్ర దివ్యదైవమైన అమరేశ్వరుని దర్శనం సకల శుభకరం అని ప్రతీతి. ఇక్కడ మరణిస్తే, వారి ఆత్మ శివునిలో కలిసిపోతుందని చెబుతారు. అంతటి మహిమాకరుడట ఇక్కడి శివుడు. 15 అడుగుల ఎత్తైన రూపంలో కనిపించే అమరేశ్వరుడిని దర్శించిన భక్తుల జీవితాలను సైతం ఉన్నతస్థితి చేర్చుతాడట. ఆయన రూపం ద్వారానే ఈ విషయాన్ని చాటుతుంటాడని చెబుతారు.

మహిమాకరుడైన ఇక్కడి అమరలింగేశ్వరుడిని ప్రతినిత్యం విశేష సంఖ్యలో భక్తులు దర్సించుకుంటారు. అమరము అంటే అంతం లేనిది అని అర్థం. తనను మొక్కిన భక్తులకు అసలు అంతం లేని శుభాలను అందించి, వారి జీవితాలను శుభ్రదం చేస్తాడు కనుకనే, ఈయనకు అమరేశ్వరుడు అని పేరు వచ్చిందంటారు.

అలంకార ప్రియుడు

శివుడు ఆది దేవుడు. అంతటి శక్తిమంత దైవానికి అమరావతి క్షేత్రంలో నిత్యం అంగరంగ వైభవంగా పూజాపునస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామిని సుందరంగా అలంకరించి పూజాధికాలు నిర్వహిస్తారు. అభిషేక ప్రియుడని పేరున్న శివుడు అమరావతిలో మాత్రం అలంకార ప్ర్రియుడిగా దర్శనమిస్తాడు. ఆలయం కూడా సువిశాల స్థలంలో నిర్మితమయ్యింది. బౌద్ధ, ద్రవిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఐదు పంచారామ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

చేరుకోవడం ఎలా?
అమరావతి క్షేత్రం గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి నిరంతరం బస్సు సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కూడా తరచూ బస్సులు వెళుతుంటాయి. వాహనాల్లో వెళ్లేవారు విజయవాడ నుంచి కృష్ణానది కరకట్ట ద్వారా వెళ్లవచ్చు.

వసతి.. ఇతర దర్శనీయ స్థలాలు..
అమరావతిలో ఏపీ టూరిజం వారి హరిత గెస్ట్ హౌస్ ఉంది. ముందుగానే గదులు బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర లాడ్జిలు కూడా అందుబాటులో ఉంటాయి.
అమరావతిలోనే కాలచక్రం నిర్వహించారు. ఇక్కడ అతిపెద్ద బుద్ధ విగ్రహం అందరికీ ఆహ్వానం పలుకుతుంది. పురావస్తు శాఖవారి మ్యూజియం కూడా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమ్మపల్లి కోదండరామాలయం

పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం. ఆలయ చరిత్ర     ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకత ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి. స్వామిని దర్శిస్తే.. ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మ

కైలాస దర్శనం: మానసరోవర యాత్ర

సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడి ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మక

నరసింహ అవతార క్షేత్రం అహోబిలం

శ్రీమహావి­ష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ....శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్టశిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహ స్వా­మి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వా­మి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు. రతనాల రాయలసీమకు ముఖద్వారం, శ్రీశైలం, మహానంది వంటి ప్రసిద్ధ శైవ ప్రదేశాలతో ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చుకున్న జిల్లా కర్నూలు. ఈ కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి­ ఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వా­మి మొత్తం 9రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వా­మి దర్శన­మిస్తారు. అవతరించిన ప్రదేశం ఇదే హరినామమే కడు ఆనందకరమూ అని ప్రతి నిత్యం శ్రీమహావి­ష్ణువు ధ్యానంలో గడిపే బాల భక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడ